ఎమ్మిగనూరులో ట్రాఫిక్ కష్టాలు: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదన

1చూసినవారు
ఎమ్మిగనూరులో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గాంధీ చౌక్ నుండి శరఫ్ బజార్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దుకాణాల ముందు వాహనాలు నిలపడం, ట్రాఫిక్ సిబ్బంది కొరత సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. రహదారుల ఇరువైపులా వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో వేచి చూడాలి.
Job Suitcase

Jobs near you