విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలు బంద్

234చూసినవారు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కొండచరియలు విరిగిపడ్డాయి. పాడేరు – విశాఖపట్నం రోడ్డులో వంజంగి కాంతమ్మ వ్యూవ్‌పాయింట్‌ దగ్గర కొండచరియలు విరిగి పడడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో అటు రాకపోకలు బంద్ అయ్యాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్