AP: తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించడం ఒక హిస్టరీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో నరేగా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైంది. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం నుంచి మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్జీ కింద పనులు చేపడతాం’ అని అన్నారు.