ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ఇందుకు రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని, సూచించిన మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్టు చేసింది. రెండు వారాల పాటు అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం జరిగిన నేపథ్యంలో ఈ తాజా అడ్వైజరీతో ప్రాధాన్యత సంతరించుకుంది.