AP: శ్రీశైలం డ్యామ్ సమీపంలోని కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఈ చిరుతపులి కుక్కలపై దాడి చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక ఉద్యోగి తన సెల్ఫోన్లో చిరుతపులి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. దీంతో కేవీ స్విచ్ యార్డ్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.