AP: రాజకీయాల్లో విమర్శలు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. YCP నేతల దిగజారుడు వ్యాఖ్యలకు అదే స్థాయిలో స్పందించడం కంటే, బాధ్యతాయుతమైన ధోరణితో వ్యవహరించడమే సరైన పద్ధతి అని ఆయన అన్నారు. దాడులు చేయడం పరిష్కారం కాదని, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేయాలని కూటమి శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.