పవిత్ర మాఘపూర్ణిమ రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు కర్తవ్యాలతో తీర్చిదిద్దబడిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తూనే ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నామని పేర్కొన్నారు. వికసిత భారత్లో భాగంగా యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని, పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.