‘సంసద్ చలో’ మార్చ్ సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని, రాళ్లు విసిరినా యువతపై కఠినంగా వ్యవహరించవద్దని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. కౌన్సెలింగ్ ఇచ్చి శాంతింపజేయడమే ప్రభుత్వాల బాధ్యత అని, నిరసనకారుల సమస్యను వినడమే బలమైన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆందోళనకారులకు, ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసేవిగా ఉన్నాయి.