AP: దిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడోసారి సీఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 'సన్రైజ్ ఆంధ్రప్రదేశ్' డాక్యుమెంటరీని ఆయన ఆవిష్కరించారు. పరిశ్రమలను సీఐఐ నిరంతరం ప్రోత్సహిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.