AP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సీఎం చంద్రబాబు కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలు ప్రతి మండలంలో జడ్పిటిసి, సర్పంచ్, ఎంపీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. స్థానిక పరిస్థితులు, నాయకుల బలం, ఆశావహుల వివరాలను పరిగణనలోకి తీసుకుని, బహుముఖ పోటీ ఉన్నచోట్ల సమన్వయంతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యూహం ద్వారా వైసీపీకి భారీ ఓటమిని అందించాలని భావిస్తున్నారు.