లోక్సభలో బుధవారం కూడా విపక్షాల నిరసన కొనసాగింది. వెల్లోకి దూసుకొచ్చి విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అయోధ్య విరాళాల చోరీ అంశంతో పాటు, విద్యార్థులపై లాఠీఛార్జ్ మీద చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఆందోళన మధ్య లోక్సభ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది.