AP: రాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఒంటిమిట్ట రామాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకటో తేదీన జరిగే కళ్యాణ వేడుకకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ప్రతి రైలు ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.