రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'వారణాసి'పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మహేశ్బాబు ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు, శ్రీరాముడి పాత్ర కోసం శరీర భాష, నిలబడి మాట్లాడే తీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందుకోసం కలరీ వంటి యుద్ధవిద్యను కూడా అభ్యసించారు. అలాగే, తన ప్రత్యేకమైన రన్నింగ్ స్టైల్ను మార్చుకోవడానికి ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు.