AP: కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్లోని వస్త్రదుకాణాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్లో జూనియర్ కళాశాల, ఎస్బీఐ శాఖ ఉన్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు అదుపులోకి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. .