నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తన ఆహ్వానం మేరకు ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆమె అధికారులను, ప్రజాప్రతినిధులను, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను కోరారు. తన ఆహ్వానం మేరకు వస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.