పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్
వాత పార్టీలో నెలకొన్న పరిణామాలపై TMC చీఫ్ మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తిరుగుబాటు వర్గాన్ని 'ద్రోహులు'గా అభివర్ణించిన ఆమె.. 'నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నన్ను ఆపడం మీవల్ల కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తు ఎక్కడికీ పోదని, తనను ఆపాలనుకుంటే చంపాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రమా భట్టాచార్య రాజీనామాపై స్పందిస్తూ.. ఆమె కొడుకు రెబల్స్తో చేతులు కలపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.