పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్పోర్టులపై అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని, ఫీజబులిటి ఉన్న చోట నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని మామునూరు ఎయిర్పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.