ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఖుర్జా జంక్షన్లో విక్రేతల మధ్య జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. అమర్ అనే వ్యక్తి గోరఖ్నాథ్ ఎక్స్ప్రెస్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీ ఫుటేజీలో రైలు వస్తుండగా.. అమర్ ట్రాక్ పైకి దూసుకెళ్తుండగా అతడిని కాపాడేందుకు సునీల్ ప్రయత్నించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో అమర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.