AP: కృష్ణా జిల్లా గుడివాడలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరం-నరసాపురం రైలులో ఓ వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణించాడు. టీసీ రావడాన్ని చూసి ఆ వ్యక్తి రైలుపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. రైల్వే పోలీసులు అతికష్టం మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.