మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మనశంకర వరప్రసాద్గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సంక్రాంతికి విడుదలైన ‘పరాశక్తి’ సినిమా కూడా ఫిబ్రవరి 7 నుంచి జీ5లో ప్రసారం కానుంది.