టీ20 ప్రపంచకప్-2026లో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ను కావాలని తప్పిస్తే అది దారుణమైన సెలెక్షన్ అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో సంజూ వైఫల్యాల నేపథ్యంలో, వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం అతడిని తప్పించి, వైభవ్ను ఆడించారని అన్నారు. అయితే సంజూ మాదిరే విఫలమైన ఇషాన్ కిషన్ను కొనసాగించారని మంజ్రేకర్ విమర్శించారు.