మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని ప్రధాని నరేంద్ర
మోదీ ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన సువర్ణరేఖ, బంగనపల్లి రకాలతో పాటు, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలను ప్రస్తావించారు. మామిడి పండు దేశ సాంస్కృతిక, వ్యవసాయ వైవిధ్యానికి ప్రతీక అని, భారతీయ ఉత్పత్తుల ప్రపంచవ్యాప్త విస్తరణకు కృషి చేస్తున్న మామిడి రైతులను అభినందించారు.