బిహార్లోని నవాడాకు చెందిన వివాహిత చోటి కుమారి ప్రియుడి కోసం రెండేళ్ల క్రితం తన భర్తను వదిలి డామన్కు వెళ్లింది. అయితే ఊహించని దారుణం చోటుచేసుకుంది. సూట్కేసులో ఆమె మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. ఈ హత్యకు ప్రియుడే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.