AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.