AP: ఇప్పటివరకు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండేవని, ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం విశాఖలోని తర్లువాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కేంద్రం, గూగుల్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సెర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్.. ఇప్పుడు
భారత్ గ్రోత్ ఇంజిన్గా మారబోతుందన్నారు. ప్రముఖ సంస్థలు విశాఖలో పెట్టుబడులు రావడం శుభపరిణామం అని అన్నారు.