AP: తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా మూడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని, పెట్టుబడిదారులకు
టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం ఉందని లోకేష్ అన్నారు.