విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్కు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ప్రముఖులను ఆహ్వానించడానికి లోకేశ్ విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా రాత్రి గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొననున్నారు.