AP: కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా హాజరైన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ సమావేశానికి సంధ్యారాణి, కొండపల్లి, ఆనం, వాసంశెట్టి సుభాష్ హాజరుకావడంలో ఆలస్యం జరిగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, తాను హెచ్ఓడీ సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా క్షమాపణ చెప్పానని, తన తప్పును సరిదిద్దుకున్నానని, మంత్రులు కూడా తమ అలవాట్లను మార్చుకోవాలని గట్టిగా సూచించారు.