ఏపీ మంత్రులు నారా లోకేశ్, పరిటాల సునీత మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. టీడీపీ ఎంపీలు వారికి స్వాగతం పలికారు. మంత్రుల వెంట కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. వీరు మంగళవారం కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్లను కలవనున్నారు. పార్లమెంట్లో జరిగే ఈ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్లో సంభవించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రులకు వివరించనున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొంటారు.