లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డి అమెరికా ప్రయాణానికి మార్గం సుగమమైంది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, తాత్కాలికంగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి కోరగా, కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.