రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ హైదరాబాద్లోని హీరో వెంకటేశ్ నివాసంలో జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో హీరోలు నాగార్జున, నాని, తేజ సజ్జా, నిర్మాతలు మైత్రీ రవి, సాహు గారు వంటి పలువురు పాల్గొన్నారు. దేశీయ సంస్కృతి, హిందూ సమాజం వంటి విషయాలపై మోహన్ భగవత్ మాట్లాడతారని, ఈ భేటీ టాలీవుడ్ను రాజకీయంగా ప్రభావితం చేయవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.