TG: హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్పాత్పై నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్కస్ చేస్తూ జీవనం సాగించే దంపతుల పాపను గురువారం అర్ధరాత్రి ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. పోలీసులు చాంద్రాయణగుట్టలో పిల్లలు లేని దంపతులకు అమ్మేసినట్లు గుర్తించి, కిడ్నాప్చేసిన వ్యక్తితోపాటు కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.