దేశంలో ఇప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగితే NDA స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)’సర్వే తెలిపింది. NDA మొత్తం 352 లోక్సభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇందులో బీజేపీ ఒక్క పార్టీకే 287 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ఇండీ’ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్కు 20 శాతం(80 సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.