బిహార్కు చెందిన గుంజన్ కుమార్ అనే విద్యార్థి JEE పరీక్షకు ముందు ఊపిరితిత్తుల సమస్యతో 3 నెలలు మంచానికే పరిమితమై, 70% కంటిచూపు కోల్పోయారు. తన కొడుకు లక్ష్యాన్ని చేరుకోవడానికి, డిగ్రీ చదివిన తల్లి విద్యార్థిగా మారి, రోజూ క్లాసులు విని నోట్స్ తయారుచేసి సహాయం చేశారు. ఆమె సహకారంతో గుంజన్ దివ్యాంగుల కోటాలో 120వ ర్యాంక్ సాధించి IIT ఢిల్లీలో సీటు పొందారు. ఇది తల్లి ప్రేమ, త్యాగానికి నిదర్శనం.