ములకల చెరువు కల్తీ మద్యం ఘటన.. సీఐ హిమబిందుపై వేటు

30చూసినవారు
ములకల చెరువు కల్తీ మద్యం ఘటన.. సీఐ హిమబిందుపై వేటు
AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం ఘటనపై కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. కల్తీ మద్యం తయారవుతున్నా పసిగట్టలేకపోయినందుకు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు వేసింది. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బాధ్యతలను లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిశోర్ కుమార్‌కు అప్పగించారు. ఇటీవల ములకలచెరువులో నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్