భారత్లోని ముంబైకి చెందిన మహిళా టీచర్ రూబల్ నాగీ ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ను అందుకున్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్లో ఆమె ఈ అవార్డును స్వీకరించారు. దేశవ్యాప్తంగా వందలాది విద్యా కేంద్రాలు ఏర్పాటుచేసి, పెయింటింగ్ల ద్వారా మురికివాడల్లోని చిన్నారులకు విద్యను అందించినందుకు రూబల్ నాగీకి ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డుతో పాటు ఆమె రూ.9 కోట్ల ప్రైజ్ మనీని కూడా అందుకున్నారు.