AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రజలెవరూ గ్రామంలోని తాగు నీటిని వినియోగించొద్దని, వంట చేసుకోవద్దని సూచించారు. అధికారులే ప్రజలకు ఆహారం సరఫరా చేస్తారని తెలిపారు. ఇవాళ్టి నుంచి తురకపాలెం ప్రజలకు మూడు పూటలా ఆహారం, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైద్యులు మిస్టరీ మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో ఉన్నారు.