రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని, నిందితులపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోనిలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన, దళితుల సమస్యలు, భూమి వివాదాలు, సామాజిక వివక్ష, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై బాధితుల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.