మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే అన్ని గ్రామాల్లో పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచామని చెబుతున్నా, 125 రోజుల పనికి అవి సరిపోవని సీపీఎం నేతలు తెలిపారు.