గాంధీ 78వ వర్ధంతి: జాతిపితకు ఘన నివాళులు

428చూసినవారు
గాంధీ 78వ వర్ధంతి: జాతిపితకు ఘన నివాళులు
హాలహర్వి మండల పరిధిలోని పచ్ఛారపల్లి గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శంకర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యూత్ జనార్ధన్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గౌరవార్థం ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వన్నూరు స్వామి, యూత్ శివకుమార్, భీమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్