కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో సద్దల గంగ శివుడు (32) అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పెళ్లి పనుల కోసం టెంకాయ చెట్టెక్కిన సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘోరం జరిగింది. ముగ్గురు పిల్లలు ఉన్న సద్దల గంగ శివుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.