ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాంజలి పథకం కింద కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, గూడూరు వాసి కరుణాకర్ రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారని కల్లూరు అర్బన్ పరిధిలోని ముజఫర్ నగర్ కు చెందిన శివకుమార్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కర్నూలులో ఎస్పీని కలిసి తన సమస్యను వివరించిన శివకుమార్, ఉద్యోగం కోసం ఒక నెలలో జాయినింగ్ లెటర్ వస్తుందని భరోసా ఇచ్చి నగదు తీసుకున్నప్పటికీ కరుణాకర్ ఉద్యోగం అందించలేదని తెలిపారు.