కర్నూలు నగరంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనపై జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, టూటౌన్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించారు. కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్ చేయాలని, సంబంధిత ఏఈ, వార్డు అమెనిటీస్ సెక్రటరీపై ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు.