కర్నూలు నగరంలోని బిర్లాగడ్డ ప్రాంతంలో బుధవారం బోయ కిరణ్ (18) అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో, స్నేహితులే కిరణ్పై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.