కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని వాణిజ్యం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా శనివారం పేర్కొన్నారు. మంత్రి ఇంటింటికి వెళ్లి మాల శ్రీనివాసులు, చిన్న ఖాసీంలకు వికలాంగుల పెన్షన్లు, మీనాక్షి, నాగమనిలకు వితంతు, ఇతరులకు వృద్ధాప్య, ఒంటరి మహిళల పెన్షన్లను ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు విచారించి పంపిణీ చేశారు.