ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో, ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్, ఆర్మ్డ్ గార్డ్స్, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, సరైన లైటింగ్, బస్సు సౌకర్యం, పరిశుభ్రత కల్పించాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని సూచించారు.