కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని, గతంలో నిలిచిపోయిన మచిలీపట్నం రైలును పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ 23వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోస్ట్కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. బీకాంప్ పోస్టాఫీస్ వద్ద పోస్టుబాక్స్లో పోస్ట్కార్డులు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి సీపీఎం వార్డు కార్యదర్శి కె. వి. జనార్దన్ రావు నాయకత్వం వహించారు. ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిటైర్డ్ ఆర్ఎంఓ డాక్టర్ రామ్ గోపాల్, సీపీఎం నగర నాయకులు ఆర్. నరసింహులు పాల్గొన్నారు.