కర్నూలు కలెక్టరేట్లో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజల వినతులు స్వీకరించబడతాయి. అర్జీల పరిష్కారం కోసం 1100కు కాల్ చేయవచ్చని లేదా Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.