ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో, పేదింటి గవిగట్టు తిమ్మక్క మనవరాలు ఉసేనమ్మ వివాహానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బసవరాజు మంగళవారం రూ.20 వేల పెళ్లి కానుక కిట్తో పాటు రూ.5 వేల నగదు అందించారు. 1వ వార్డు మహమ్మద్ రూ.1,000, వైఎస్సార్సీపీ నాయకుడు హరున్ రూ.1,000 పెళ్లి కానుకగా ఇచ్చారు. నాయకుడు నాగరాజు గౌడ్ అన్నదానానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కరేపాకు తిక్కయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.