కర్నూలు జిల్లా, మంత్రాలయం సమీపంలోని పెద్దకడుబూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు కుదె మారెప్పకు మంగళవారం మార్గమధ్యంలో ఒక పర్సు దొరికింది. అందులో సుమారు రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.1,300 నగదు ఉన్నాయి. మారెప్ప వెంటనే ఆ పర్సును పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి, పర్సు యజమాని చాకలి మధుగా గుర్తించి, బంగారం, నగదును వారికి అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న మారెప్పను పోలీసులు సన్మానించి అభినందించారు.